Sunday, May 19, 2024

Covid-19: దేశంలో తగ్గిన థర్డ్ వేవ్.. కొత్తగా 6 వేల కేసులు

దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోయింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 6,396 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,51,556 కు చేరింది. దేశంలో 201 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 5,14,589కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,450 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,23,67,070 కు పెరిగింది. ఇక దేశంలో ప్రస్తుతం 69,897 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.  ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,78,29,13,060 కరోనా వ్యాక్సిన్లు డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement