Sunday, April 28, 2024

India Omicron: దేశంలో 5,488కి చేరిన ఒమిక్రాన్ కేసులు

భారత్ లో కరోనా, ఒమిక్రాన్‌ కేసుల విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు కరోనా కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. అదే సమయంలో ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరిగాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు చేరింది.  మొత్తం 2,162 మంది బాధితులు ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు.

దేశంలో 1,367 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. 792 కేసులతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలో 549, కేరళలో 486, కర్ణాటకలో 479, పశ్చిమ బెంగాల్‌లో 294, యూపీలో 275 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 260, గుజరాత్ లో 236, తమిళనాడులో 185 కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 61కి పెరిగింది.

క‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement