Wednesday, May 15, 2024

India Covid: భారత్ లో కరోనా కల్లోలం.. ఒక్క రోజే 2.47 లక్షల కేసులు

దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగిపోతున్నాయి. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,47,417 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే నేడు 27 శాతం కేసులు పెరిగాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,018,358 కు చేరింది. కరోనాతో నిన్న 380 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో 11,17,531 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. రోజు వారి కరోనా పాజిటివిటీ రేటు 13.11 గా నమోదు అయింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 84,825 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇప్పటివరకు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 34,321,803 కు చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement