Sunday, May 19, 2024

దేశంలో క‌రోనా కేసులు-కొత్త‌గా 16,866

నేటి క‌రోనా కేసులు కొత్త‌గా 16,866న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసులు 4,39,05,621కి చేరాయి. ఇందులో 4,32,28,670 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,074 మంది మరణించారు. మరో 1,50,877 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతానికి పెరిగిందని వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.34 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొన్నది. రికవరీ రేటు 98.46 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 202.17 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.గత 24 గంటల్లో 18,148 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement