Wednesday, May 8, 2024

ల‌క్ష దిగువన రోజువారీ కేసులు

దేశంలో 63 రోజుల త‌ర్వాత తొలిసారి ల‌క్ష క‌న్నా త‌క్కువ‌గా  రోజువారీ కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో మొన్న‌ 1,00,636 క‌రోనా కేసులు నమోదు కాగా, నిన్న 86,498 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం… నిన్న 1,82,282 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,89,96,473కు చేరింది. మరో 2,123 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,51,309కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,73,41,462  మంది కోలుకున్నారు. 13,03,702  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement