Thursday, May 2, 2024

Ind Vs Nz : రెండు వికెట్లు కోల్పోయిన భారత్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రెండు వికెట్ కోల్పోయింది. రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిచిన భారత్‌ మూడో రోజు ఆటమెదలు పెట్టింది. అయితే, మయాంక్‌ అగర్వాల్‌ 62 పరుగులు చేసి అజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో విల్‌ యంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 115 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 47 పరుగులు చేసిన పుజారా.. అజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో రాస్‌ టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 

కాగా, క్రీజులో శుభ్‌మాన్‌ గిల్‌(15), కోహ్లి(4)పరుగులతో ఉన్నారు. 41 ఓవర్లకు టీమిండియా రెండు నష్టానికి 130 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement