Thursday, May 16, 2024

పెరుగుతున్న కరోనా.. కొత్తగా 16,906 పాజిటివ్ కేసులు

కరోనా మహమ్మారి కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా.. 16,906 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,36,69,850కి చేరింది. ఇందులో 4,30,11,874 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,519 మంది మరణించారు. మరో 1,32,457 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 45 మంది మృతిచెందగా, 15,447 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కేసుల రోజువారీ పాజిటివిటీ రేటు 3.68గా ఉందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement