Saturday, May 18, 2024

ఏపీ తెలంగాణ‌లో సంద‌డి.. భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గురు పౌర్ణమి పురస్కరించుకుని భ‌క్తులు బాబా గుడికి త‌ర‌లివ‌స్తున్నారు. రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్ర‌త్యేక పూజ‌లు, పాలాభిషేకం వంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇక‌.. కృష్ణాజిల్లా మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్ లోని దేశంలోనే అతిపెద్ద సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠాప‌న‌ కలిగిన సాయినాథ్ దేవాలయంలో వేకువజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చి దర్శించుకుంటున్నారు.

ఈ సంద‌ర్భంగా దేవాలయ కమిటీ భక్తుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ.. గురు పౌర్ణమి పుష్కరించుకుని సాయినాధుని గురువుగా పూజించి దర్శించుకుంటారో వారికి అంతా మంచే జ‌రుగుతుంద‌ని, అందుక‌ని భక్తులు గురుపూర్ణిమను ప్ర‌త్యేకంగా తీసుకుని బాబాని దర్శించుకుంటారని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement