Tuesday, May 7, 2024

Big Breaking | అధికారంలోకి వస్తే, కేసీఆర్​ పథకాలు ఉంటయ్​.. ధరణి పోర్టల్​ తీసేయమన్న బండి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ సంచలన కామెంట్స్​ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే బండి ఇవ్వాల (శుక్రవారం) మాత్రం తెలంగాణ సీఎం కేసీఆర్​కు అనుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తెలంగాణలో ఒకవేళ తాము అధికారంలోకి వస్తే కేసీఆర్​ తీసుకొచ్చిన పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్​ పార్టీ నేతలు చెప్పినట్టు ధరణి పోర్టల్​ని తాము రద్దు చేయబోమని, ధరణి పోర్టల్​లో ఉండే సమస్యలను మాత్రం పరిష్కరిస్తామన్నారు.

అంతేకాకుండా, కాంగ్రెస్​ పార్టీ, బీఆర్​ఎస్​ కలిసి రాజకీయ డ్రామాలకు తెరతీశాయని, కాంగ్రెస్​లో ప్రీ, పోస్ట్​ పెయిడ్​ అభ్యర్థులను కేసీఆర్​ తయారు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కర్నాటక ఎన్నికల కోసం డబ్బులు ఇచ్చింది కూడా కేసీఆర్​ అని బండి ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement