Monday, May 13, 2024

IAS: ఐదుగురు డిప్యూటీ కలెక్టర్ల‌కు ఐఏఎస్ హోదా.. ప్ర‌భుత్వ నిర్ణ‌యం

డిప్యూటీ క‌లెక్ట‌ర్లకు ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్ హోదా క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందులో 2019, 2020, 2021 ప్యానల్ సంవత్సరాలకు చెందిన నిర్మలా కాంతి వెస్లీ, కోట శ్రీవత్స, చంద్రశేఖర్, ప్రియాంక, అరుణశ్రీ ఈ జాబితాలో ఉన్నారు. ఇక నిర్మలా కాంతి వెస్లీ ఫైలు ఏడాదిన్న కాలంగా సచివాలయంలో పెండింగ్​లో ఉంది… తాజాగా ఆ ఫైలు కదిలింది. ఫైలు ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖలో ఉంది.

త్వరలోనే doptకి ఈ ఫైలు వెళ్లనుంది. ఇందులో ఇద్దరు కోట శ్రీవత్స దివంగత ips ks వ్యాస్ కుమారుడు కాగా, నిర్మలా కాంతి వెస్లీ ys రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన dsp వెస్లీ భార్య. ఇక ఈ జాబితా ఆమోదం అనంతరం తదుపరి జాబితాలో ప్రమోటీ డిప్యూటీ కలెక్టర్లు ias హోదా కోసం వెళ్లనున్నారు. ఐదుగురు కూడా state civil service కోటాలో confird ias కానుండగా కారుణ్య నియామకాలు, group-1ద్వారా డిప్యూటీ కలెక్టర్ లుగా అయిన వారే.

Advertisement

తాజా వార్తలు

Advertisement