Sunday, April 28, 2024

Breaking: హైదరాబాద్​ బౌలర్ల విజృంభణ.. పంజాబ్​ను 151కే కట్టడిచేసిన సన్​రైజర్స్​..

టాటా ఐపీఎల్​ 2022లో 28వ మ్యాచ్​లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) ముంబైలోని డీవైపాటిల్​ స్టేడియంలో పంజాబ్​ కింగ్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ పోరు​ జరిగింది. ఫస్ట్​ బ్యాటింగ్​ చేసిన పంజాబ్​ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్​లో హైదరాబాద్​ బౌలర్లు సూపర్​ ఆటతీరు కనబరిచారు. ఇందులో ఉమ్రాన్​ మాలిక్ 4 వికెట్లు​, భువనేశ్వర్​కుమార్​ 3 వికెట్లు తీసి పంజాబ్​ నడ్డీ విరగ్గొట్టారు. నటరాజన్​, జగదీశ్​ సుచిత్​కి చెరో వికెట్​ దక్కింది.

కాగా, పంజాబ్​ బ్యాట్స్​మన్​లో శిఖర్​ ధవన్​ (8), సిమ్రాన్​ సింగ్​ (14), జానీ బరిస్తో (12), జితేష్​ శర్మ (11), ఓడియన్​ ​ స్మిత్​ (13), షారుఖ్​ ఖాన్​ (26) పరుగులు మాత్రమే చేశారు. రాహుల్​ చాహర్​ (0), వైభవ్​ అరోరా(0) డకౌట్లుగా వెనుతిరిగారు. ఈ టీమ్​లో లివింగ్​స్టోన్ (60)​ ఒక్కడే గౌరవప్రదమైన స్కోరు చేయడంతో పంజాబ్​ టీమ్​ ఆమాత్రం స్కోరు సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement