Saturday, May 11, 2024

డెయిరీ డే 2 ప్రీమియం ఐస్‌క్రీం టబ్స్‌ విడుదల..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : డెయిరీ డే ఐస్‌ క్రీమ్‌లు భారతదేశంలోని ప్రముఖ ఐస్‌క్రీం బ్రాండ్‌లలో ఒకటి, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, పాండిచ్చేరి, గోవాలో విస్తృతమైన ఉనికిని కలిగి ఉంది. రెడ్‌ వెల్వెట్‌ ఐస్‌ క్రీమ్‌, చోకో కేక్‌ అండ్‌ ఫడ్జ్‌ ఐస్‌ క్రీం ప్రీమియమ్‌ టబ్‌లు విడుదల చేసింది. ఈసందర్భంగా డెయిరీ డే డైరెక్టర్‌ ఎం. ఎన్‌.జగన్నాథ్‌ మాట్లాడుతూ.. డైరీ డే ఎల్లప్పుడూ ప్రతిచోటా ఐస్‌ క్రీం అభిమానులకు ఆనందాన్ని అందించే ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని చూస్తుందన్నారు. తమ కస్టమర్లకు ప్రీమియం ఐస్‌ క్రీమ్‌లను అందిస్తున్నందుకు తాము సంతోషిస్తున్నామన్నారు.

తమ ఫ్యాక్టరీలో పరిశోధనల ఫలితాలు ఈ రెడ్‌ వెల్వెట్‌, చోకో కేక్‌ అండ్‌ ఫడ్జ్‌ ఐస్‌ క్రీమ్‌లు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయని నిరూపించాయన్నారు. డైరీ డే బ్రాండ్‌ దాని విలక్షణమైన రుచులకు ప్రసిద్ధి చెందిందన్నారు. వినూత్నమైన కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి తాము నిరంతరంగా ప్రయత్నం చేస్తూనే ఉంటామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement