Tuesday, May 7, 2024

హర్యానాలో రెండ్రోజులపాటు హోం మంత్రుల భేటీ.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి లేఖలు

హర్యానాలోని సూరజ్​కుండ్​లో ఈనెల 27, 28 తేదీల్లో హోం మంత్రుల భేటీ జరగనుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ నుంచి సెప్టెంబర్​ 30వ తేదీన లేఖలు అందాయి. ఈ సమావేశంలో పోలీసు బలగాల ఆధునీకరణ, మాదక ద్రవ్యాల వంటి మత్తు పదార్థాలపై నిషేధం.. అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేయండి.. శత్రు ఆస్తులను నియంత్రించే చట్టాల వరకు పలు అంశాలతో పాటు దేశ అంతర్గత భద్రతపై ఈ భేటీలో చర్చించి చర్యలు తీసుకోనున్నారు.

అయితే.. ఈ భేటీకి పశ్చిమబెంగాల్​ సీఎం, హోం మంత్రిగా ఉన్న మమతా బెనర్జీకి కూడా ఆహ్వానం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కానీ, ఆ రాష్ట్రం నుంచి మమతా హాజరవుతారా, లేదా అన్న సమాచారం మాత్రం అందలేదని తెలుస్తోంది. కాగా, బెంగాల్​ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరూ లేఖ అందుకున్నట్లు ధ్రువీకరించలేదని సమాచారం.  

ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శులు, డీజీపీలను కూడా ఆహ్వానించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 30న అన్ని రాష్ట్రాలకు పంపిన ఆహ్వానంపై బెంగాల్​ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎవరూ వ్యాఖ్యానించడానికి ఇష్టపడనందున, చింతన్ శివిర్ అని పిలిచే ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ నుండి ఎవరైనా హాజరవుతారా లేదా అనేదానిపై కూడా క్లారిటీ లేదు.

- Advertisement -

ఇక.. రెండు రోజులపాటు జరిగే సమావేశం ప్రారంభ వేడుక సెషన్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్​షా మాట్లాడతారని, ఇందులో ఏడు వేర్వేరు సెషన్‌లు ఉంటాయని తెలుస్తోంది. రాష్ట్ర హోం మంత్రులు తమ రాష్ట్రాల వారీగా తీసుకుంటున్న చర్యలపై ప్రజెంటేషన్‌ చేయనున్నారు.  

కాగా, బెంగాల్ సీఎం మమతకు, కేంద్ర హోం మంత్రి అమిత్​షాకు మధ్య అంత మంచి రిలేషన్​ లేదు. అంతేకాకుండా.. ఈడీ, సీబీఐ వంటి వివిధ కేంద్ర సంస్థల హైపర్​ యాక్టివిటీ కారణంగా ఆమె ఇటీవల అతనిపై మండిపడుతూ సీరియస్​ కామెంట్స్​ చేస్తున్నారు. మరి ఈ భేటీకి మమతా వస్తారా, లేదా అన్నది తెలియడం లేదని కొంతమంది అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement