Monday, May 6, 2024

‘విజ‌య్ సేతుప‌తి’పై ప‌రువున‌ష్టం దావా .. ఎందుకో తెలుసా ..

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తిపై ప‌రువున‌ష్టం దావా కేసుని వేశాడు మ‌హాగాంధీ అనే వ్య‌క్తి. కార‌ణం ఏంటంటే తాను విజ‌య్ సేతుప‌తిని ప్ర‌శంసించినా త‌న‌పై దాడి చేశార‌ని ఫిర్యాదులో తెలిపాడా వ్య‌క్తి. మైసూర్ విమానాశ్ర‌యం లో విజ‌య్ సేతుప‌తి ని క‌లిశాన‌ప్పుడు విజ‌య్ సేతుప‌తి న‌ట‌న గురించి.. ఆయ‌న విజ‌యాల గురించి చెప్పాన‌ని అన్నారు. అంతే కాకుండా విజ‌య్ సేతుప‌తి పై ప్రశంస‌లు కురిపించాన‌ని అన్నాడు. అయినా.. త‌న పై విజ‌య్ సేతుప‌తి దాడి చేశాడ‌ని తెలిపాడు. విజ‌య్ సేతుప‌తి తో పాటు ఆయ‌న మేనేజ‌ర్ కూడా దాడి చేశాడ‌ని తెలిపాడు. ఈ దాడిలో తన చెవికి తీవ్ర గాయం అయింద‌ని వెల్ల‌డించాడు. దీంతో వినికిడి శ‌క్తి కూడా కోల్పోయాన‌ని చెప్పాడు. కానీ విజ‌య్ సేతుప‌తి ఈ దాడి విష‌యంలో ఒక క‌ట్టుక‌థ అల్లార‌ని.. అందుకే విజ‌య్ సేతుప‌తి పై ఫిర్యాదు చేసిన‌ట్టు వెల్ల‌డించాడు. మ‌రి విజ‌య్ సేతుప‌తి ఈ ఘ‌ట‌న‌పై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement