Tuesday, May 14, 2024

బిహార్ లో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు 20మంది మృతి

బిహార్ లోభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచి 48 గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పిడుగులు పడ్డాయి. రాష్ట్రంలో పిడుగుపాటుకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటు వల్ల కైమూర్ జిల్లాలో ఏడుగురు, పాట్నా, భోజ్‌పూర్ జిల్లాల్లో నలుగురు చొప్పున, జహానాబాద్, ఆర్వాల్, రోహ్‌తాస్, ఔరంగాబాద్, సివన్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు సీఎం నితీశ్ కుమార్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement