Friday, April 26, 2024

ponguleti : ఏ పార్టీలో చేరేది హైదరాబాద్ లో చెప్తా… పొంగులేటి

తాను ఏ పార్టీలో చేరేది హైదరాబాద్ లో చెప్తానని మాజీ ఎంపీ, సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. ఖమ్మంలో తన అనుచరులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఏ పార్టీలో చేరేది చెబుతానని.. దీనికి ఎంతో సమయం తీసుకోనని.. రెండు, మూడు రోజుల్లోనే క్లారిటీ ఇస్తానంటూ స్పష్టం చేశారు పొంగులేటి. హైదరాబాద్ వేదికగా పార్టీ మార్పు అంశాన్ని ప్రకటిస్తానని వెల్లడించారాయన. బీఆర్ఎస్ నేతలు చాలా అవాకులు చెవాకులు పేలుతునారని.. వాళ్ల గర్వం అణిచే రోజు త్వరలోనే వస్తుందన్నారాయన.

ఏ పార్టీలో చేరాలనేదానిపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వేలాది మంది అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. చేరబోయే పార్టీ పేరు ప్రకటించిన తరువాత ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. జాతీయ పార్టీ పెట్టుకున్నం అని డబ్బాలు కొట్టుకున్న నేతలకంటే తాను నిర్వహించబోయే బహిరంగ సభ గొప్పగా ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement