Thursday, May 2, 2024

చుచుంద్ లో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం

నిర్మల్ : భైంసా మండలంలోని చుచుంద్ గ్రామంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు పవార్ రామారావు పటేల్ శుక్రవారం మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఇంటింటా ప్రచారం చేపట్టారు. మొదట శివాలయంలో పూజలు నిర్వహించిన ఆయన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, బైంసా మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, ఎంపీటీసీ రజాక్, ఈలేగం సర్పంచ్ ముత్యం, డైరెక్టర్ శ్రీనివాస్, మండల కార్యకర్తలు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement