Sunday, May 5, 2024

పంజాబ్‌ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది: రాహుల్‌ గాంధీపై మంత్రి హరీశ్‌ రావు విమర్శలు

కాంగ్రెస్‌ పార్టీ రైతు డిక్లరేషన్‌పై మంత్రి హరీశ్‌ స్పందించారు. పంజాబ్‌ రైతులే నమ్మలేదని, చైతన్యవంతులైన తెలంగాణ రైతులు ఎలా నమ్ముతారని ఆ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీని మంత్రి హరీశ్‌ ప్రశ్నించారు. ‘రాహుల్ గాంధీ గారూ, వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది. పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్ – చైతన్యవంతులైన తెలంగాణ రైతులు నమ్ముతారా? ఇది రాహుల్ సంఘర్షణ సభ – రైతు సంఘర్షణ సభ కాదని తెలంగాణ ప్రజానీకం భావిస్తున్నారు. ఎయిర్ పోర్టులో దిగి ఇవ్వాల ఏం మాట్లాడాలి, సభ దేని గురించి అని అడిగిన రాహుల్‌ గాంధీకి తెలంగాణ రైతుల గురించి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. ఎప్పటికీ తెలంగాణలోని సబ్బండ వర్గాల సంక్షేమం గురించి నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ మాత్రమే’ అని మంత్రి హరీవ్‌ రావు ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement