Friday, May 3, 2024

మండ‌లి చైర్మ‌న్‌గా గుత్తా ఏక‌గ్రీవం, బాధ్యతల స్వీకరణ.. అభినందించిన పలువురు మంత్రులు

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్ రెడ్డి
ఒక్కరే నామినేషన్ వేయడంతో మండలి ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయనను ప్రొటెం చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రి ఇవ్వాల చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారు.

మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డికి మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావు, మహమూద్ అలీ, వి. శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సిహెచ్ మల్లా రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement