Thursday, May 9, 2024

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌.. మొక్కలు నాటిన హీరోయిన్ మెహ్రీన్‌

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో టాలీవుడ్ హీరోయిన్‌ మెహ్రీన్‌ పిర్జాదా పాల్గొన్నారు. రామానాయుడు స్టూడియోలో గురువారం మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు మెహ్రీన్‌.

రాబోయే తరాలకు మంచి ఆక్సిజన్‌ అందించేందుకు, గ్రీన్‌ ఇండియా, క్లీన్‌ ఇండియా కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మెహ్రీన్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం మెహ్రీన్‌కు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement