Saturday, May 11, 2024

రేపు గోవాలో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నున్న ప్రియాంక‌..

గోవాలో జ‌రిగే ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ రెడీ అయ్యింది. ప్ర‌చారానికి సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రేపు (శుక్ర‌వారం) ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆమె బహిరంగ సభలో ప్రసంగించడంతో పాటు ప‌లు వర్గాలతో ముఖాముఖీ మాట్లాడనున్నారు. అస్సోల్నా, క్యూపెం తాలూకాల్లోని మోర్పిర్ల వద్ద గిరిజన మహిళలతో సంభాషించడంతో పాటు వారితో కలిసి భోజనం చేస్తారని, అలాగే విద్యా కార్యకర్తలతో మాట్లాడుతారని పేర్కొన్నారు. కోస్తా మైదానం, అక్వెమ్‌లో ‘ప్రియదర్శని మహిళా’ సమ్మేళనంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక ప్ర‌సంగించ‌నున్న‌ట్టు స‌మాచారం. మహిళా కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలతో భేటీకానున్నారు ప్రియాంక. చికాలీమ్ మైదానంలో మోర్ముగోవ్ పార్టీ కార్యకర్తల పాల్గొంటారని, ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరుతారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement