Wednesday, May 8, 2024

స‌ర్కారు వారి పాట యూనిట్ కి గుడ్ న్యూస్ – టిక్కెట్స్ ధ‌ర పెంచుకోవ‌చ్చ‌న్న ఏపీ స‌ర్కార్

స‌ర్కారు వారి పాట చిత్ర యూనిట్ కి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ స‌ర్కార్ టిక్కెట్స్ ధ‌ర పెంచుకోవ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.
టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా “సర్కారు వారి పాట”. ఈ నెల 12న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 10 రోజుల పాటు టికెట్ల‌పై రూ.45 మేర‌ పెంచుకోవ‌చ్చంటూ ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది ఆయా సినిమాల విడుద‌లకు ముందు స‌ద‌రు సినిమా నిర్మాత‌లు ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌లిసి త‌మ బ‌డ్జెట్‌ను చూపి సినిమా టికెట్ల రేట్ల పెంపున‌కు అభ్య‌ర్థిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే స‌ర్కారువారి పాట సినిమా యూనిట్ కూడా ఏపీ ప్ర‌భుత్వాన్ని టికెట్ల రేట్ల పెంపున‌కు అభ్య‌ర్థించింది. ఈ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించిన ఏపీ స‌ర్కారు… స‌ర్కారువారి పాట సినిమా టికెట్ల రేట్ల పెంపున‌కు అనుమ‌తి మంజూరు చేసింది. దీంతో సర్కారు వారి పాట చిత్ర యూనిట్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement