Monday, April 29, 2024

మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర!


పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూస్. బంగారం ధర పడిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం  ధర సోమవారం స్వల్పంగా తగ్గింది. అయితే, వెండి ధర స్వల్పంగా పెరిగింది. బంగారం ధర రూ.90 తగ్గగా.. వెండి ధర రూ.110 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పది గ్రాముల బంగారం  ధర రూ.90 వరకు తగ్గి రూ.48,990కు చేరింది. కేజీ వెండి ధర రూ.66,850వద్ద ఉంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి  ధర రూ.48,990గా ఉంది. కిలో వెండి ధర రూ.66,850 వద్ద ఉంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి తరుణం. ఎందుకంటే ఈ ఏడాది చివరికి బంగారం ధర రూ.58 వేలకు చేరొచ్చనే అంచనాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement