Friday, April 26, 2024

మెట్రో రైలు సమయం పొడిగింపు

మెట్రో ప్రయాణికులకు తీపి కబురు. కరోనా తగ్గడంతో మెట్రో రైలు సర్వీసులను పెంచిన అధికారులు..  తాజాగా మెట్రోరైలు రాకపోకల సమయాన్ని మరికొంత పొడిగించారు. ఇప్పటివరకు ఉదయం 7.10 నుంచి రాత్రి 9.45 గంటల వరకు నడిచిన రైళ్లను అదనంగా మరో గంటన్నరపాటు పెంచారు. ఉదయం 7 గంటలకు బయలుదేరిన రైళ్లు రాత్రి 11.15 వరకు నిర్విరామంగా తిరగనున్నాయి. చివరి రైలు టర్మినల్‌ స్టేషన్‌ నుంచి రాత్రి 10.15 గంటలకు బయలుదేరి 11.15 వరకు చివరి స్టేషన్‌కు చేరుకుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. పెంచిన వేళలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement