Wednesday, May 15, 2024

పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. మండిపోతున్న బంగారం ధర

పసిడి ప్రేమికులకు ఇది బ్యాడ్ న్యూస్. బంగారం ధర పరుగు పెడుతోంది. బుధవారం కూడా పసిడి రేటు పెరిగింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు.  బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పైకి పెరిగి ధర రూ.48,490కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.44,450కు చేరింది. ఇక, వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి ధర రూ.67,700కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement