Monday, April 29, 2024

Big Breaking | గ్లోబల్​ హీరో మోదీ.. కాంగ్రెస్​కు కడుపుమండుతోంది

ప్రపంచం అంతా భారత ప్రధాని మోదీని కొనియాడుతుంటే.. దేశంలో ఉన్న ప్రతిపక్ష కాంగ్రెస్​ నేతలు మాత్రం నిత్యం తిడుతున్నారని, కులం, మతం పేరుతో దూషిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఇవ్వాల (ఆదివారం) నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలో జరుగుతున్న నవ సంకల్ప సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

మోదీ ది బాస్​ అని దేశాధినేతలే కొనియాడుతున్నారన్నారు. ఈజిప్టు అత్యున్నత పురస్కారం మోదీకి దక్కిందన్నారు. ఆర్థికంగా దూసుకుపోతున్న దేశం మనదే. ఆయన దేశానికి ప్రపంచానికి ఎంతో చేశారు. తెలంగాణలో 11300 కోట్లతో అభివృద్ధి చేపట్టారు. రైల్వే లైన్​ డబ్లింగ్​, వందే భారత్​  రైళ్లను మోదీ ఇచ్చారు.

2300 కిలోమీటర్ల రూట్లను తెలంగాణలో వేశాం. తెలంగాణలో డబుల్​ బెడ్రూం ఇండ్ల పేరుతో అవినీతికి పాల్పడ్డారు. 2019లో నిధులు దుర్వినియోగంపై ఐదుగురు సభ్యులతో కమిటీ వేశారు. బీబీనగర్​ ఎయిమ్స్​, సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్ల ఆధునికీరణ చేపట్టాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement