Saturday, May 4, 2024

Eluru: రోడ్డు ప్రమాదంలో.. మూడేళ్ల చిన్నారి మృతి

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఏలూరు జిల్లా ఏలూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉయ్యూరుకు చెందిన ఒక కుటుంబం ద్వారకా తిరుమల దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. చోదిమెళ్ళ జాతీయ రహదారిపై లారీని వెనుక నుండి ఢీకొండంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement