Thursday, May 2, 2024

రాధేశ్యామ్ నుండి గ్లింప్స్ రిలీజ్‌

పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ నుండి వాలైంటైన్ డే సంద‌ర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మంచు కొండల్లో.. చాలా రొమాంటిక్‌ గా ప్రభాస్‌, పూజ హెగ్డే ఈ గ్లింప్స్‌ లో మనకు కనిపిస్తున్నారు.. రాధేశ్యామ్‌ మూవీ మార్చి 11 వ తేదీన థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం.. ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement