Wednesday, April 24, 2024

అట‌వీ ప్రాంతంలో యువకుడి ఆత్మ‌హ‌త్య

వికారాబాద్ టౌన్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి అట‌వీ ప్రాంతంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా పరిగి తీగకు తాడుతో ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన . సోమవారం రోజు వెలుగు చూసింది. సంఘటనకు సంబంధిత వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రోజు అనంతగిరి అట‌వీ శాఖ సిబ్బంది గుర్తించి వికారాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ రాజశేఖర్ కు ఫోన్ లో యువకుడు చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతిచెందిన‌ సమాచారం ఇవ్వడంతో సంఘటన వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతి చెందిన వ్యక్తి వద్ద లభించిన సెల్ ఫోన్, మరి కొన్ని ఆధారాల ప్రకారం మృతుడు పగిడే.నవీన్ కుమార్ (25), సంగారెడ్డి జిల్లా సదాశివ పేట మండల్ భానూర్ ( బి. డి. ఎల్) గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం సదాశివపేట పోలీస్ స్టేషన్ కు మృతుని సమాచారం అందించడంతో శనివారం రోజు మృతుని అక్క మంజుల సదాశివపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై సదాశివ పేట్, వికారాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement