Monday, May 6, 2024

Breaking: గౌరెల్లి భూ నిర్వాసితుల స‌మ‌స్య కొలిక్కి.. మంత్రి హ‌రీశ్‌తో చ‌ర్చ‌లు స‌ఫ‌లం!

సాగునీటి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన గౌర‌వెల్లి గ్రామాస్తులు త‌మ‌కు త‌గిన న్యాయం చేయాల‌ని ఆందోళ‌న చేస్తున్నారు. ఇది కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని ఆ స‌మస్య ప‌రిష్కారానికి ట్ర‌బుల్ షూట‌ర్ మంత్రి హ‌రీశ్‌ని పంపింది. కాగా, సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మెట్టుబండల వద్ద మంత్రి హరీశ్ రావుని గౌరవెల్లి భూ నిర్వసితులు ఇవ్వాల క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారితో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, నాయకులు కోదండ రెడ్డి కూడా ఉన్నారు.

- Advertisement -

అయితే.. నిర్వాసితులను మంత్రి హరీశ్ రావు సాదరంగా ఆహ్వానించారు.. వీరి మ‌ధ్య దాదాపు గంటసేపు చర్చలు కొన‌సాగిన‌ట్టు తెలుస్తోంది. కాగా, నిర్వాసితుల డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించిన‌ట్టు స‌మాచారం. మంత్రి హ‌రీశ్‌, నిర్వాసితుల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మైన‌ట్టు తెలుస్తోంది. ఈ చ‌ర్చ‌ల అనంత‌రం నిర్వాసితులకు, కాంగ్రెస్ నాయకులకు మంత్రి హరీష్ రావు భోజ‌నం పెట్టించి మ‌రీ పంపించిన‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement