Thursday, May 9, 2024

ప‌టియాలా హౌస్ కోర్టులో.. గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్

ఢిల్లీ ప‌టియాలా హౌస్ కోర్టులో పంజాబ్ గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ ని ఎన్ఐఏ అధికారులు హాజ‌రుప‌రిచారు. కాగా పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్నాడు లారెన్స్ బిష్ణోయ్..ఈ నెల 1న బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ థాకరే శివసేన పార్టీకి చెందిన ఎంపీ సంజయ్‌ రౌత్ ని చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్‌ పంపింది. దాంతో ముంబైలోని కంజూర్‌ మార్గ్‌ పోలీస్‌స్టేషన్‌లో బిష్ణోయ్‌పై కేసు నమోదైంది. సిద్దూ మూసేవాలాను హతమార్చినట్టే తనను కూడా హతమారుస్తామని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ తనకు బెదిరింపు మెసేజ్‌లు పంపిందంటూ సంజయ్‌ రౌత్‌ పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణ కోసం జైల్లో ఉన్న బిష్ణోయ్‌ని NIA అధికారులు మంగ‌ళ‌వారం పటియాలా హౌజ్‌ కోర్టుకు తీసుకొచ్చారు. బిష్ణోయ్‌ గ్యాంగ్ ..సంజయ్‌ రౌత్ నే కాకుండా బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఆఫీస్‌కు కూడా చంపుతామని బెదిరింపు కాల్స్‌ చేసింది. దాంతో ఖాన్‌కు భద్రతను పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement