Wednesday, May 15, 2024

చైనాకి దిమ్మ తిరిగే జ‌వాబు – భార‌త్ జ‌వాన్లు ఏం చేశారంటే

గ‌ల్వాన్ వ్యాలీలో చైనా జెండాను ఆవిష్క‌రించిన రోజే .. భార‌త సైన్యం త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించింది. ఈ మేర‌కు ఫొటోలు రిలీజ్ అయ్యాయి. కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు ట్విట్ట‌ర్ లో ఫొటోల‌ను పోస్ట్ చేశారు. గ‌ల్వాన్ లోయ‌లో జెండాను ఆవిష్క‌రించి రెచ్చ‌గొట్టిన చైనాకు అంతేధీటుగా మ‌న సైన్యం జ‌వాబుఇచ్చింద‌న్నారు. న్యూ ఇయ‌ర్ రోజున ధీశాలులైన భార‌త జ‌వాన్లు గ‌ల్వాన్ లోయ‌లో జెండాని ఎగ‌ర‌వేశార‌ని కామెంట్ పెట్టారు. మైనస్ 8 డిగ్రీల శీతల పరిస్థితుల్లోనూ మన సైన్యం పనిచేస్తోందని, భారత సైన్యం జోష్ ఎప్పుడూ అత్యున్నతంగానే ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement