Tuesday, May 7, 2024

కెసిఆర్ పై పోటీకి దిగుతున్న గ‌ద్ద‌ర్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ ప్రజా యుద్ధనౌక గద్దర్‌ సంచలన ప్రకటన చేశారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీ- చేస్తానని ప్రకటించారు. నెలరోజుల్లో తాను కొత్త పార్టీ ప్రకటన చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టిన యువ సంఘర్షణ సభకు పీసీసీ ఆహ్వానం మేరకు తాను వచ్చానని గద్దర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య పార్టీ అని.. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గద్దర్‌ కొత్త పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అలాగే కెసిఆర్ పోటీ చేసే గ‌జ్వేల్ నుంచి తాను పోటీ చేస్తాన‌ని గ‌ద్ద‌ర్ ప్ర‌క‌టించ‌డం మ‌రో సంచ‌ల‌నంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement