Monday, May 6, 2024

చిన్నారుల భవితకు – పోలియో చుక్కలు – స్పీకర్ తమ్మినేని

ఆమదాలవలస : తాహసిల్దార్ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు.ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. పోలియో లేని రాష్ట్రంగా ఆవిర్భవించాలని, పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, సూపర్డెండ్oట్ రామకృష్ణ, మెడికల్ ఆఫీసర్లు శిరీష, బాలచంద్ర, శ్రీనివాసరావు,బొడ్డేపల్లి రమేష్ కుమార్,ఆల్లంసెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామలరావు, పొన్నాడ చిన్నారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూసుమంచి శ్యాం ప్రసాద్, బొడ్డేపల్లి రమణమూర్తి, బొడ్డేపల్లి కోటేశ్వరరావు ఏఎన్ఎంలు వరలక్ష్మి రవణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement