Thursday, May 9, 2024

ఈ నెల 22నుండి.. గంగాన‌ది పుష్క‌రాలు

గంగాన‌ది పుష్క‌రాలు ఏప్రిల్ 22న ప్రారంభం కానున్నాయి. కాగా దేశంలో అత్యంత పవిత్ర నదిగా భావించే గంగా నది పుష్కర శోభ సంతరించుకుంది. వైశాఖ శుక్ల విదియ రోజున గురుడు మేషరాశిలో ప్రవేశించడంతో గంగా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలు మే 3న వైశాఖ శుక్ల ద్వాదశి నాడు ముగియనున్నాయి. పుష్కరుడు ఈ 12 రోజుల పాటు గంగానదిలో ఉంటాడని హిందువులు విశ్వసిస్తారు. అందుకే పుష్కర సమయలో గంగా స్నానం, దానం, పితృదేవతలకు తర్పణం చేయడం వంటి క్రతువులు నిర్వహిస్తారు. కాగా, పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. పుష్కర ప్రాంతాల్లో భక్తులకు భోజన వసతి కల్పిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement