Monday, April 29, 2024

నాలుగ‌వ రోజు న‌ష్టాల‌తో ముగిసిన – స్టాక్ మార్కెట్లు

వ‌రుస‌గా నాలుగ‌వ‌రోజు న‌ష్ట‌పోయాయి స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల తగ్గుదల నేపథ్యంలో ఈ ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం 41 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం రానుందనే అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో వారు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్లు కోల్పోయి 53,416కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 15,938 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్ స్టాకులు ఎక్కువగా నష్టపోయాయి. సన్ ఫార్మా (2.28%), డాక్టర్ రెడ్డీస్ (1.73%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.50%), మారుతి (1.45%), టైటాన్ (0.85%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ మిగిలాయి. యాక్సిస్ బ్యాంక్ (-1.74%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.53%), ఎస్బీఐ (-1.48%), టెక్ మహీంద్రా (-1.44%), టీసీఎస్ (-1.31%) టాప్ లూజర్స్ నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement