Sunday, May 12, 2024

వెబ్ సిరీస్ గా మాజీ ప్ర‌ధాని ‘పీవీ న‌ర‌సింహారావు’ జీవిత చ‌రిత్ర


ఇప్ప‌టికే ప‌లువురి జీవిత చ‌రిత్ర‌లు తెర‌కెక్కాయి. ఎన్టీఆర్ ద‌గ్గ‌ర నుంచి మ‌హాన‌టి సావిత్రి వ‌ర‌కు వెండితెర‌పై వారి చ‌రిత్ర‌ని ఆవిష్క‌రించారు. కాగా మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుపై ఓ వెబ్ సిరీస్ రానుందట‌. భారతదేశ రూపురేఖలను పీవీ మార్చిన తీరుపై వినయ్ సీతాపతి ‘హాఫ్ లయన్’ పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. ఇప్పుడీ పుస్తకం ఆధారంగా అదే పేరుతో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నారు. పీవీ నరసింహారావు 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా పనిచేశారు. పీవీ తన హాయంలో దేశంలో పలు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత సాధించారు. 1992లో హిందూ-ముస్లింల అల్లర్లకు దారితీసిన అయోధ్యలోని బాబ్రీ మసీదు విధ్వంసం కూడా ఆయన హయాంలోనే జరిగింది.కాగా ఈ వెబ్ సిరీస్ ను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో దీనిని తెరకెక్కించనున్నట్టు ప్రకాష్ ఝా ప్రకటించారు. 2023లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్‌ను ఆహా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement