Wednesday, May 8, 2024

Rythu Bandhu: రేపటి నుంచే రైతుబంధు.. రైతుల ఖాతాలో డబ్బులు!

రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రేపటి(డిసెంబర్ 15) నుంచి రైతుబంధు నిధులను పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోకే జమకానున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతుబంధు కోసం దాదాపు రూ. 7,500 కోట్లను సర్దుబాటు చేసేందుకు ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. సీఎం ఆదేశాలతో రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి నగదు జమకానుంది. నగదు బదిలీ కార్యక్రమం ఈ నెల చివరి వరకు కొనసాగనుంది.

గత వానాకాలంలో తొలి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండు ఎకరాల భూమి ఉన్నవారికి, మూడో రోజు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్నవారికి రైతుబంధు డబ్బును పంపిణీ చేశారు. ఈ సారి కూడా అదే పద్ధతిని అవలంభించాలని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement