Thursday, May 2, 2024

Covid-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం గడిచిన దేశంలో కొత్త‌గా  5,784 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న క‌రోనా నుంచి 7,995 మంది కోలుకున్నారు. అయితే, క‌రోనాతో మరో 252 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం దేశంలో 88,993 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం  3,41,38,763 కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,75,888కి చేరింది. ఇక, దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 133.8 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement