Saturday, May 4, 2024

MLC Results: ఖమ్మంలో TRS అభ్యర్థి తాతా మధు విజయం

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో TRS అభ్యర్థి తాతా మధు విజయం సాధించారు. తాతా మధు 247 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 768 ఎమ్మెల్సీ ఓట్లకు గానూ 738 ఓట్ల పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకు 486 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు 239 ఓట్లు వచ్చాయి. దీంతో తొలి ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు గెలుపొందినట్లు ఈసీ అధికారులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement