Tuesday, May 14, 2024

ఫుడ్‌, వుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల వృద్ధిపై దృష్టి.. రాయల్‌ థాయ్‌ సర్కార్‌తో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఫుడ్‌ ప్రాసెసింగ్‌, వుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల వృద్ధికి పరస్పర సహకరం అందించుకోవడానికి రాయల్‌ థాయ్‌ గవర్నమెంట్‌తో తెలంగాణ పరిశ్రమల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, థాయ్‌లాండ్‌ ప్రభుత్వ ప్రతినిధులు ఈ ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌, వుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో పెట్టుబడులు, వాణిజ్యానికి ఉన్న అవకాశాలను రెండు ప్రభుత్వాలు పరిశీలించనున్నాయి.

ఇవి కాక చిన్న తరహా పరిశ్రమలు, స్టార్టప్‌ల వృద్ధికి సహకరించుకోవడం కూడా ఈ ఒప్పందంలోని మరో ముఖ్యమైన అంశమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు. ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ థాయ్‌లాండ్‌ డిప్యూటీ ప్రధాని జురిన్‌ లక్షనవిసిట్‌ వర్చువల్‌ పద్ధతిలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement