Monday, April 29, 2024

UP: నిద్రిస్తున్న ఐదుగురిని కిరాతకంగా చంపి… ఆపై గన్ తో కాల్చుకుని..

ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురిని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసి.. అనంతరం తనూ గన్​తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో చోటుచేసుకుంది. ఉత్తర్​ప్రదేశ్​లో నిద్రిస్తున్న ఐదుగురిని గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపాడు ఓ యువకుడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురిని చంపిన అనంతరం.. నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మైన్​పురి జిల్లాలోని గోకుల్​పుర్​లో ఈరోజు తెల్లవారుజామున జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

అసలేం జరిగిందంటే.. గోకుల్​పుర్​కు చెందిన శివవీర్ యాదవ్​(30).. తన సోదరులు భుల్లన్ యాదవ్​​(25), సోనూ యాదవ్(21), సోనూ భార్య సోనీ(20), బావ సౌరభ్(23), స్నేహితుడు దీపక్​ (20)లను గొడ్డలితో నరికి చంపేశాడు. దీంతో వారంతా అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం భార్య డాలీ, మేనత్తపై దాడికి పాల్పడ్డాడు. తర్వాత తనను తాను గన్​తో కాల్పులకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన నిందితుడు శివవీర్ యాదవ్​ మేనత్త, భార్యను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు శివవీర్ ఎందుకు ఈ హత్యలకు పాల్పడ్డాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement