Thursday, May 2, 2024

Breaking: పొలం వివాదంలో కాల్పులు.. ఆరుగురు మృతి

స్థల వివాదంలో రెండు వర్గాలు కాల్పులు జరుపుకోవడంతో ఆరుగురు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. మధ్య ప్రదేశ్ లోని మొరేనా సమీపంలోని లేపా గ్రామంలో పొలం గట్టు విషయంలో జరిగిన వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. పరస్పరం తుపాకులతో కాల్చుకోవడంతో.. ఈ కాల్పుల్లో ఆరుగురు మృతిచెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కొన్నేళ్లుగా నలుగుతున్న ఈ వివాదంలో ఈరోజు పెనుదుమారం రేపింది. చివరకు ఆరుగురు బలవ్వగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement