Monday, April 29, 2024

ల‌క్ష‌ ఇస్తే మూడు ల‌క్ష‌లు… న‌కీలీ నోట్ల దందా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు-రట్టయింది. లక్ష ఒరిజినల్‌ నోట్లకు మూడు లక్షలు నకిలీ నోట్ల చొప్పున నడుస్తోన్న అక్రమ దందాను పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో భాగ స్వామ్యమునన్‌ కొంతమంది అక్రమార్కులను పట్టుకు న్నారు. నకిలీ నోట్ల చెలామనికి సంబంధించి మొత్తం 13మందిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి దగ్గరనుంచి రూ.30లక్షల విలువైన దొంగ నోట్లు- స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లు- పోలీసులు గుర్తించారు. నిందితుల్లో చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరుకు చెందినవారు ఉన్నారు.
ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వివరాలను వెల్లడించారు. ఇది లోకల్‌ గ్యాంగ్‌ కాదని తేల్చి చెప్పారు. మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ఈ ఫేక్‌ కరెన్సీ ముఠా ఆపరేషన్స్‌ చేస్తోందన్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటకతోపాటు- ఏపీలో ఫేక్‌ కరెన్సీని చెలామణి చేస్తున్నట్టు- సీపీ కొచ్చారు. పట్టు-కున్న వారిలో రాజేష్‌ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. రాజేష్‌ ఓ ఇంటర్నేషన్‌ స్కూల్‌లో డ్యాన్స్‌ టీ-చర్‌గా పనిచేస్తున్నట్లు- సమాచారం.

రాజేష్‌ లక్ష రూపాయలకు 5 లక్షల ఫేక్‌ కరెన్సీని కొనుగోలు చేసి వాటిని ఇతరులకు లక్ష ఒరిజినల్‌ కరెన్సీకి మూడు లక్షలు ఫేక్‌ కరెన్సీ ఇచ్చేలా రాకెట్‌ నడుపుతున్నాడు. సైబరాబాద్‌ పరిధిలో 2013 నుంచి ఇప్పటివరకు దాదాపుగా 3,60,000 కరెన్సీ పట్టు- పడిందని సీపీ తెలిపారు. నిందితుడు రాజేష్‌ తరచూ చెన్నైకి వెళ్లి ఫేక్‌ నోట్స్‌ తీసుకొస్తున్నట్లు- పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఫేక్‌ నోట్స్‌ ఉదయం సమయాల్లో కాకుండా సాయంత్రం తర్వాత చిన్న వ్యాపారుల వద్ద మారుస్తున్నారు.

పాత నేరస్తులపై నిఘా పెట్టి ఈ ముఠాను పట్టు-కున్నట్లు- పోలీసులు తెలిపారు. రాజేష్‌, నిలేష్‌ అనే ప్రధాన నిందితులు సాయత్రం, రాత్రి వేళల్లో ఫేక్‌ నోట్స్‌ అమాయకుల దగ్గర సర్క్యులేట్‌ చేస్తున్నట్లు- గుర్తించారు. నిందితుల నుంచి 30 లక్షల 68వేల 500 ఫేక్‌ నోట్స్‌, క్యాష్‌ 60వేల 500వందల నగదు, 13 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు- తెలిపిన పోలీసు అధికారులు, చెలామని అవుతున్న నకిలీ కరెన్సీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement