Saturday, April 27, 2024

మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ప్రసాద్‌ రావు కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన చాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

కాగా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రసాద్‌ రావు డీజీపీగా సేవలు అందించారు. 1979వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రసాదరావు.. కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ ఎస్పీగా పనిచేశారు. ఏసీబీ డీఐజీగా, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్‌ గానూ సేవలు అందించారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగానూ పనిచేశారు. డీజీపీ వి.దినేశ్ రెడ్డి తర్వాత 30 సెప్టెంబరు 2013లో ఇన్‌ చార్జ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. తన అందించిన సేవలకు గాను 1997లో ఇండియన్ పోలీస్ మెడల్, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకాలను అందుకున్నారు.

ఇదీ చదవండి: కార్పొరేట్ శక్తుల గుప్పిట్లోకి విశాఖ మహానగరం?

Advertisement

తాజా వార్తలు

Advertisement