Saturday, April 27, 2024

Breaking: ఛత్తీస్‌గ‌ఢ్​ లో ఎన్​కౌంటర్​.. మావోయిస్టు డిప్యూటీ కమాండర్​ మృతి

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం బిజాపూర్​ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ డిప్యూటీ కమాండర్​ చనిపోయినట్టు తెలుస్తోంది. ఇవ్వాల పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఈ ఎదురుకాల్పుల ఘటన జరిగినట్టు సమాచారం. కైకా,మౌస్లా మధ్య అటవీ ప్రాంతంలో DRG,222 బెటాలియన్ బలగాలకు,మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 3 లక్షల రివార్డు ఉన్న సాండ్రా లాస్ డిప్యూటీ కమాండర్ రితీష్ పునేమ్ మృతిచెందాడు. కాగా, ఈ ఘటనలో ఒక జవాన్​కు గాయాలయ్యాయి. ఘటనా స్థలం వద్ద ఒక ఆయుధం, పిస్టల్, మావోయిస్టుల వస్తు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement