Sunday, May 5, 2024

Breaking | తెలంగాణ-ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ బోర్డ‌ర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు మావోయిస్టులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మ‌ధ్య‌ ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చ‌నిపోయారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ క్రమంలో చర్ల మండలం పుట్టపాడు వద్ద మావోయిస్టులు వారికి తారసపడ్డారు.

దీంతో మావోయిస్టులు గ్రేహౌండ్స్‌ బృందంపై తొలుత కాల్పులు జ‌రిపిన‌ట్టు స‌మాచారం. ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చ‌నిపోయిన‌ట్టు పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. మృతుల్లో ఒకరు ఎల్ఓఎస్ కమాండర్ రాజేశ్‌ కాగా, మరొకరు సీఎన్ఎం కమాండర్ నందా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో లభించిన ఎస్‌ఎల్‌ఆర్‌ (SLR), వస్తు సామ‌గ్రిని పోలీసు బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement