Friday, May 17, 2024

టెన్త్ ఫెయిల్ – ఎపిలో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య ..

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని కొందరు, ఉత్తీర్ణత కాలేదని మరికొందరు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఇద్దరు బాలికలు మృత్యువాత పడ్డారు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండలం నవాబుకోటకు చెందిన వలిపి సుహాసిని (15) పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైంది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది.
ధర్మవరం మండలం పోతులనాగేపల్లికి చెందిన దినేశ్ కుమార్ పదో తరగతిలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తల్లిదండ్రులు కుమారుడిని వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు.
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన శివకుమార్ తాడిపత్రిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదివాడు. నిన్నటి ఫలితాల్లో 434 మార్కులు వచ్చాయి. మార్కులు తక్కువ వచ్చాయన్న మనస్తాపంతో తోటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానంతో వెళ్లిన తండ్రి గంగరాజుకు కుమారుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. దీంతో వెంటనే తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోతులదొడ్డి గ్రామానికి చెందిన కస్తూర్బా స్కూలు న పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పదవ తరగతి పరీక్షల్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినానని మనస్థాపంతో వేల్పుల కామేశ్వరి తమ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement