Saturday, April 27, 2024

హిందీలో ‘దువ్వాడ జ‌గ‌న్నాథం’

2017లో వ‌చ్చిన దువ్వాడ జ‌గ‌న్నాథం చిత్రం అప్ప‌ట్లో హిట్ గా నిలిచింది. కాగా ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలోకి రీమేక్ చేయ‌నున్నారు. దువ్వాడ జ‌గ‌న్నాథం చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజాహెగ్డే జంట‌గా న‌టించారు. కాగా ఈ రీమేక్ లో హీరోగా ఎవ‌రు న‌టించ‌నున్నారో తెలియాల్సి ఉంది. తెలుగులో ఈ సినిమాకి దర్శక, నిర్మాతలుగా వ్యవహరించిన హరీశ్ శంకర్ – దిల్ రాజు, హిందీ రీమేక్ ను కూడా వారిద్ద‌రే కలిసి చేయనున్నారట. ఈ సినిమాతోనే హరీశ్ శంకర్ బాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి రంగంలోకి దిగుతున్నారట. మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement