Sunday, May 12, 2024

నేన‌ట్ల అన‌లేదు, త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్దు.. వైర‌ల్ కామెంట్స్‌పై సాయిప‌ల్ల‌వి రీయాక్ష‌న్‌

‘కశ్మీర్ ఫైల్స్‌’పై తాను చేసిన కామెంట్స్ గురించి హీరోయిన్ సాయి పల్లవి వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తాను ఎవ‌రినీ కించ‌ప‌రిచేలా మాట్లాడ‌లేద‌న్నారు.. ‘‘నా దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్పే. ఏ మతంలోనైనా హింస మంచిది కాదని గతంలోనే చెప్పా. ఒక డాక్టర్‌గా ప్రాణం విలువ నాకు తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు’’ అని చెప్పుకొచ్చారు సాయిప‌ల్ల‌వి.

ఈ మ‌ధ్య‌నే విడుదలైన ‘విరాట పర్వం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశానని చెప్పిన ప‌ల్ల‌వి.. పశువులను తీసుకెళ్తున్న లారీ డ్రైవర్‌పై దాడి చేయడాన్ని ప్రశ్నించారు.

దీంతో చాలా మంది ఆమె మాటలను తప్పుబట్టారు. ఉగ్రవాదులతో కలిసి కొందరు చేసిన మారణహోమాన్ని ఒక చిన్న ఘటనతో ఎలా పోలుస్తావ‌ని ఆమెపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై సాయి పల్లవి మ‌రోసారి వివ‌రణ ఇవ్వాల్సి వ‌చ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement